Monday, 30 January 2017

ఆశాకిరణం - Pencil art

Pencil sketch - కవిత courtesy Smt. Ponnada Lakshmi
అంతరించిన ఆశాకిరణం.
నీరవ ప్రకృతి నిదురలో జోగుతున్నవేళ 
నీవు నామదిలో రేపుతున్న అలజడి.
నిశ్శబ్ధనిశీధిలో నీ స్మృతులతో
నీరు నిండిన కనులతో నేనొక్కర్తినే
నీ రాకకై ఎదురు చూసి చూసి అలసితిని.
నీకేల నా మీద దయ రాదు ప్రియా?
నీ మదిలో నా తలపే మాసిపోయేనా?
నిన్ను ప్రేమతో నిజముగ పిలిచిన
నీవు వచ్చి నన్ను లాలింతువని భ్రమసితిని.
నా గొంతు తడారిపోయేలా సఖా! సఖా! అని
నిన్నే పిలిచి పిలిచి విసిగి వేసారితిని.
నీకేమో నా పిలుపందదు,
నాకేమో నీ పై ఆశ చావదు.
నీ రాకకై ఎదురు చూస్తూ ఎన్ని
నిద్రలేని రాత్రులో? ఎంత తీరని ఆవేదనో?
నీకోసం ఆర్తితో, తపనతో నిరీక్షిస్తూ,
నిస్పృహతో నిస్సారంబై నిలిచితిని.
- పొన్నాడ లక్ష్మి

No comments:

Post a Comment

A Worried farmer.

Will the Farmer Get the Right Price for His Efforts? The farmer works from dawn to dusk, battling the sun, uncertain rains, rising input cos...